వేల్పూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్, మే 24 : శవ రాజకీయాలను సహించేది లేదని, కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ హత్యాఘటనపై బీఎస్పీ నాయకుడు ముత్యాల సునీల్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు విమర్శించా రు. ఘటనపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, నీవు సిద్ధమా? అని సునీల్రెడ్డికి సవాల్ విసిరారు. వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాల్లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు.
వేల్పూర్ మండల కేంద్రంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు మాట్లాడుతూ.. హాసాకొత్తూర్లో హత్య ఘటనలో నిందితుడి కాల్డేటాను వెలికితీస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. సునీల్రెడ్డికి దమ్ముంటే నిందితుడి కాల్డేటాను తీసుకొచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.
ఆరోపణలను నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని, నిరూపించని పక్షంలో రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని సునీల్రెడ్డిని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి ప్రశ్నించారు. నీలాగ తుపాకీ పట్టుకొని వేముల కుటుంబసభ్యులు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటివారైనా శిక్షించాలని మంత్రి ప్రశాంత్రెడ్డి సీపీతో మాట్లాడారని అన్నారు. శవ రాజకీయాలు చేసే సంస్కృతి టీఆర్ఎస్ది కాదన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, రైతుబంధు సమితి మండల కో-ఆర్టినేటర్ మోహన్రెడ్డి, పచ్చలనడ్కుడ, పడగల్ సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, హన్మంత్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సుధాకర్గౌడ్, గంగారెడ్డి, రాజేశ్వర్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, నాయకులు ద్యావతి రాజ్కుమార్, బబ్బురు ప్రతాప్, సామ మహేందర్, ఏలేటి మోహన్, భీమ ప్రసాద్, కుమ్మరి రాజన్న పాల్గొన్నారు.
‘నిరూపిస్తే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తా’
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానని మోర్తాడ్ ఎంపీపీ శివలింగుశ్రీనివాస్ అన్నారు. ఎంపీపీ తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. మంత్రిపై ఏదో ఒకటి మాట్లాడాలని రాజకీయ అనుభవలేమితో సునీల్రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. సోయి లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ మోత్కుభూమన్న, ఎంపీటీసీ రాజ్పాల్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఆదేశాలతో నిందితుల అరెస్ట్
హాసాకొత్తూర్ ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సీపీని ఆదేశించారని, పోలీసులు రెండు రోజుల్లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారని కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైతం అరెస్టు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారన్నారు. వాస్త వ పరిస్థితులు ఇలా ఉంటే సునీల్రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.