డిచ్పల్లి/జక్రాన్పల్లి, మే 14 : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గడ్డం (కేశ్పల్లి) గంగారెడ్డి కుమారుడు గడ్డం ఆనంద్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబా ద్లో గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామ మైన జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామానికి ఆనంద్రెడ్డి భౌతికకాయాన్ని అంబులెన్స్లో శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధు లు, నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధులు మీదుగా అంతిమయాత్ర నిర్వహించి డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి శివారులోని ఫామ్హౌస్లో అంత్యక్రియలను నిర్వహించా రు. చిన్నకూతురు కావ్యరెడ్డి ఆనంద్రెడ్డి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తనూజ, ఎంపీపీ డీకొండ హరిత, వైస్ ఎంపీపీ విమల, కేశ్పల్లి సర్పంచ్ మహేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోజన్న, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
స్వగ్రామం అభివృద్ధికి తపించిన వ్యక్తి
గడ్డం ఆనంద్రెడ్డి తన స్వగ్రామమైన కేశ్పల్లి అభివృద్ధికి ఎంతో తపించారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆర్థికంగా అండగా నిలిచారు.
కేశవనాథ ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.కోటితో ఆలయ అభివృద్ధి, కల్యాణ మండపం నిర్మాణ పనులు చేపట్టారు.
మూడుసార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ..
గడ్డం ఆనంద్రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
అనంతరం బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఆనంద్రెడ్డి హఠాన్మరణంతో గ్రామ స్తులు కన్నీరుమున్నీరయ్యారు.
సంతాపం తెలిపిన
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
వేల్పూర్/ఖలీల్వాడి, మే 14 : టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు గడ్డం ఆనంద్రెడ్డి అకాల మరణంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనంద్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆనంద్రెడ్డి మృతి బాధాకరం
ఆనంద్రెడ్డి హఠాన్మరణం బాధాకరమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేశ్పల్లి గ్రామాభివృద్ధికి ఆనంద్రెడ్డి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆనంద్రెడ్డి మరణం టీఆర్ఎస్కు తీరని లోటని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు.