భీమ్గల్/ఆర్మూర్, జూలై 13 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నదని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పట్టణంలో ఏడువేల మొక్కలను నాటినట్లు తెలిపారు. ఇంటింటికీ పదివేల మొక్కలను పంపిణీ చేశామన్నారు. మరో మూడువేల మొక్కలు నాటి 20 వేల మొక్కల మార్కును సాధిస్తామన్నారు. ఆర్మూర్లోని 36 వార్డుల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పండిత్ పవన్, కౌన్సిలర్లు కాలనీల్లో మొక్కలను పంపిణీ చేశారు. కోటార్మూర్లోని 6వ వార్డులో కౌన్సిలర్ మురళీధర్రెడ్డి, మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. పెర్కిట్, కోటార్మూర్ మాజీ ఉపసర్పంచ్ పసుపుల రవి, టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, తలారి చందు, మెప్మా అధికారిణి మేఘన, బి.మేఘన, కుంట వర్ష తదితరులు పాల్గొన్నారు.