వేల్పూర్, జూలై 9: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో రాము, క్రాంతి, సాగర్, ఎర్రన్న, శ్రీనివాస్, రజినీకాంత్, గంగాధర్, కిషన్, చిట్టి, సాయిలు, సురేశ్తో పాటు 50 మందిక కార్యకర్తలు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్రెడ్డి, జడ్పీటీసీ గంగాధర్, ఎంపీపీ సుకన్య కమలాకర్, దూదిగాం సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వడ్ల శ్రీనివాస్, రాజు, అశోక్, మండల కో-ఆప్షన్ సభ్యుడు బాబా తదితరులు పాల్గొన్నారు.