https://www.ntnews.com/nizamabad/141029-141029/(opens in a new tab)
బోధన్, జూలై 9: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు కోరారు. మండలంలోని కల్దుర్కి విండో ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించగా..జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భం గా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను విరివిగా పెంచాలన్నారు. జిల్లాలో 59 లక్షల మొక్కలను హరితహారంలో నాటాలని నిర్ణయించామని, ఈ లక్ష్యసాధన కోసం ప్రజాప్రతినిధులు, సర్పంచు లు, ప్రజలు కృషిచేయాలని కోరారు. పల్లె ప్రగతి కింద జిల్లాలోని 530 జీపీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు కొనసాగుతున్నాయన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిం చారు. విరివిగా మొక్కలు నాటాలని, ఏ వీధికి, ఏ ఇంటికి వెళ్లినా మొక్కలు కనిపించాలని అన్నారు.
కల్దుర్కి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ మొక్కల పెంపకం జిల్లాలోనే ఒక మోడల్గా నిలవాలని ఆకాంక్షించారు. పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులను త్వరలో అందించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. అనంతరం కల్దుర్కి సొసైటీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు అవసరమైన 250 ట్రీ గార్డులను లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అందించింది. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సింహాచలం, ఆర్డీవో రాజేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్లు గింజుపల్లి శరత్, గిర్దావర్ గంగారెడ్డి, ఎంపీపీ చైర్పర్సన్ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మి, రైతుబంధు సమితి బోధన్ మండల కో-ఆర్డినేటర్ మాణిక్ వెంకట్రెడ్డి, ఎంపీపీ వైస్ చైర్మన్ కోట గంగారెడ్డి, కల్దుర్కి సర్పంచ్ నారాయణరావు, కల్దుర్కి ఎంపీటీసీ సంగెపు లక్ష్మి, కల్దుర్కి సొసైటీ వైస్ చైర్మన్ ప్రకాశ్ పటేల్, సొసైటీ కార్యదర్శి పి.బసవేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ప్రతినిధులు రమారెడ్డి, అనంతలక్ష్మి, కొడాలి కిశోర్, వై.శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, పల్లెంపాటి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.