పేదలకు వైద్య సేవలు మరింత చేరువ
ప్రయాణ ఖర్చులు లేకుండాఅంబులెన్స్ సౌకర్యం
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్ జీజీహెచ్లోడయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
ఖలీల్వాడి, జూన్ 6: పేద ప్రజలకు వైద్య సేవలను ప్రభుత్వం మరింత చేరువ చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాలు, హౌసిం గ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని జీజీహెచ్లో రూ.ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని చెప్పారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో పరీక్షలు చేసే వీలు ఉందని చెప్పారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను దవాఖానకు తీసుకురావడానికి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానలో ల్యాబ్ లేకపోవడంతో ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించడానికి వేలల్లో డబ్బులు ఖర్చు అయ్యేవని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జిల్లాకు ఒక డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని మందులు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో శాంపిళ్లను తీసుకొని జీజీహెచ్లోని డయాగ్నస్టిక్ సెంటర్కు పంపిస్తారని చెప్పారు. రిపోర్టు ఆధారంగా వైద్యులు తగిన విధంగా చికిత్స అందిస్తారని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా డయాగ్నస్టిక్ సెంటర్ను నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. జిల్లాలోని 42 పీహెచ్సీల్లో శాంపిళ్లను సేకరించి జిల్లాకేంద్రంలోని దవాఖానకు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఆరు వ్యాన్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ లత, డీఎంహెచ్వో బాలనరేంద్ర, దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.