Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. హిమాచల్ ప్రదేశ్లో మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా హిమాచల్ ప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతలు అమర్యాదక వ్యాఖ్యలు చేయబోరని, తమకు అలాంటి వైఖరిపై విశ్వాసం లేదని సుఖ్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. తాము లోక్సభ ఎన్నికల్లో అంశాల వారీగా తాము పోరాడతామని తేల్చిచెప్పారు. కంగనా రనౌత్ కూడా సంచలన, అమర్యాదకర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
ఇక మండి నుంచి బాలీవుడ్ నటిపై హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిపింది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్ధానాలకు జూన్ 1న లోక్సభ ఎన్నికల ఏడో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Congress | ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి!.. ఏఐసీసీకి తలనొప్పిగా మారిన ఎంపీ అభ్యర్థి ఎంపిక