వేల్పూర్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/డిచ్పల్లి/ధర్పల్లి/కోటగిరి, మే 6: మండలంలోని ఆయా గ్రా మాల్లో రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను ప్రజాప్రతినిధులు గురువారం పంపిణీ చేశారు. పచ్చలనడ్కుడ, వేల్పూ ర్, పడగల్, అంక్సా పూర్, కుకునూర్, కొమన్పల్లి, వెంకటాపూర్, మోతె, లక్కోర గ్రామాల్లో ముస్లిము లకు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో తహసీల్దార్ సతీశ్రెడ్డి, ఎంపీపీ భీమ జమున, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, వైస్చైర్మన్ బోదపల్లి సురేశ్, ఎంపీటీసీలు మొండి మహేశ్, ఆయా గ్రామాల సర్పంచులు తీగల రాధ, ద్వావతి వర్షిణి, మహేశ్, పత్రి రాజేశ్వర్, రాజే శ్వర్రెడ్డి, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, రిక్క మధు తదిత రులు పాల్గొన్నారు.
ముప్కాల్లో..
బాల్కొండలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావణ్య, తహసీల్దార్ విక్రమ్, ఎంపీడీవో సంతోష్కుమార్ 300 మందికి దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాద వ్, మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, టీఆర్ఎస్ నాయకు లు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఆర్మూర్లో..
ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముస్లి ములకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కొనసాగింది. 16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సుంకరి ఈశ్వరి, టీఆర్ఎస్ నాయకులు సుంకరి రంగన్న గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. మండలంలోని మిర్ధాపల్లి గ్రామంలో సౌడ మధు వర్మ, చేపూర్లో టీఆర్ఎస్ నాయకుడు షాహీద్ తదితరులు గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
రాయకూర్లో..
రుద్రూర్ మండలంలోని రాయకూర్లో రంజాన్ కానుకలను సర్పంచ్ గంగారాం ముస్లిములకు అంద జేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెంట గంగా రాం, గోవింద్, ఎంపీటీసీ హన్మంత్రావు, మైనార్టీ నాయకుడు ఖాజా తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లిలో..
డిచ్పల్లి మండలానికి మంజూరైన రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను ఎంపీపీ గద్దె భూమన్న, జడ్పీటీసీ దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య పంపిణీ చేశారు. డిచ్పల్లి మం డలానికి మొత్తం 400 జతల దుస్తులు వచ్చాయని తహసీల్దార్ శ్రీనివాస్రావు తెలిపారు. తహసీల్ కా ర్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు నయీం, ఎంపీటీసీ సవిత, నా యబ్ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్దావర్ సాయాగౌడ్, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, నాయకులు రాజు, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ తోఫాల ను ధర్పల్లిలో మైనార్టీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అక్తర్, నాయకుడు అబ్దుల్ హమీద్ ముస్లిములకు అం దజేశారు. మండలకేంద్రంలోని షాదీఖానలో నిర్వ హించిన కార్యక్రమంలో ఇర్ఫాన్, ఎండీ.వసీయొద్దీన్, అమీరుద్దీన్, జమాలుద్దీన్ తదిత రులు పాల్గొన్నారు.
కల్లూర్లో..
కోటగిరి మండలంలోని కల్లూర్ గ్రామంలో పలు వురు ముస్లిములకు రంజాన్ కానుకలను సర్పంచ్ వోలే లక్ష్మీలింగంప్ప పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుజాతావెంకట్రెడ్డి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి, ఉపసర్పంచ్ చల్ల మోహన్, లింగప్ప తదిత రులు పాల్గొన్నారు.