నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 4: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నిర్వహించారు. 11 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతోపాటు మందులు అంజేశామని, హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించామని వైద్యాధికారులు, సిబ్బంది తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం 20 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
కోటగిరి మండలంలోని సుంకినిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చిందని సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. రెండు రోజుల క్రితం ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో మండల అధికారుల బృందం సోమవారం సుంకిని గ్రామాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయగా వారికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. గ్రామంలో 24 మందికి పరీక్షలు చేయగా 24 మందికి నెగెటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కల్పన, ఏఎన్ఎం సవిత, ఆశ కార్యకర్తలు శశికళ, పుష్పలత ఉన్నారు. డిచ్పల్లి మండలంలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి బాబురావు తెలిపారు. 34 మందికి టీకా వేసినట్లు పేర్కొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల ప్రధాన వైద్యాధికారి రఘువీర్గౌడ్ తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే కొవిడ్ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. మోస్రాలోని పీహెచ్సీలో 45 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 49 మందికి పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మోపాల్ మండలంలో 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు.
సిరికొండ మండల కేంద్రంలోని పీహెచ్సీలో 43 మందికి పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి మోహన్ తెలిపారు.
పాజిటివ్ వచ్చిన వారికి కిట్లు అందజేసి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో 35 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, అయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 43 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త మోహన్ తెలిపారు. బోధన్ మండలంలో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని సాలూరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. 104 మందికి పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. సాలూరా చెక్పోస్టులో 74 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్గా వచ్చింది.
పెగడాపల్లి పీహెచ్సీలో 15 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, ఖండ్గామ్లో ఒకరికి పాజిటివ్గా వచ్చినట్లు తెలిపారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చిందని మండల అధికారులు తెలిపారు. వేల్పూర్ మండలంలో 12 పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి అశోక్ తెలిపారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 20 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్ నాయక్ తెలిపారు. భీమ్గల్ మండలంలో 15 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యుడు అజయ్ పవర్ తెలిపారు.