నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 3: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా సోమవారం వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు. భీమ్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 42 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, అయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ వచ్చిందని, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందని, ఆర్మూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ తెలిపారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 13 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 19 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు, సిబ్బంది తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చిందని, వీరికి హోం ఐసొలేషన్తోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామని వైద్యాధికారి, సిబ్బంది తెలిపారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 74 మందికి టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల అధికారులు తెలిపారు.
రెంజల్ పీహెచ్సీలో 11 మందికి పాజిటివ్, కందకుర్తి చెక్ పోస్టు వద్ద ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. వారికి ఐసొలేషన్ కిట్లను అందజేశారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. మాక్లూర్లో 37 మందికి టెస్టులు నిర్వహించగా 10 మందికి, కల్లడిలో 41 మందికి టెస్టులు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 50 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ రవికుమార్ తెలిపారు. చౌట్పల్లి సీహెచ్సీలో 25 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. మోపాల్ మండంలో సోమవారం మొత్తం 40 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు.
ధర్పల్లి మండలంలో సోమవారం 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. కోటగిరి మండలంలో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 మందికి పరీక్షలు చేయగా.. ఏడుగురికి, పొతంగల్ పీహెచ్సీ పరిధిలో 58 మందికి పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని పీహెచ్సీలో 71 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారిణి స్వప్న తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో సోమవారం 47మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 41 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శుభాకర్ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ దిలీప్ తెలిపారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 43 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి అశోక్ తెలిపారు.