ఆర్మూర్, ఏప్రిల్ 30 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇండ్లల్లో ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం(ఆర్మూర్) కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానను శుక్రవారం ఆయన సందర్శించారు. దవాఖానలో కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేయాలని సూచించారు. దవాఖానలో 30 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 150 ఐసొలేషన్ బెడ్లు చికిత్స అందించడానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో మరో 80 పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. దవాఖానలో కరోనా పరీక్షల నిమిత్తం తాత్కాలికంగా ఇద్దరు వైద్యులను నియమించి స్వయంగా తానే వేతనం చెల్లిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కరోనా బాధితులకు అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని వారికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, సూపరింటెండెంట్ నాగరాజు, మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, టీఆర్ఎస్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, బెన్కి గంగామోహన్, పూజా నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఆర్థిక సహాయం
ఆర్మూర్, ఏప్రిల్ 30 : కరోనా పలువురు జర్నలిస్టులు మృతిచెందిన విషయాన్ని ఎమ్మెల్యే జీవన్రెడ్డి దృష్టికి జర్నలిస్టు ప్రతినిధులు శుక్రవారం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ రాచర్ల రాజేశ్వర్, ఆల్గోట్ జ్ఞానేశ్వర్, నందిపేట్కు చెందిన దర్శనం అశోక్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని హామీనిచ్చారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 30: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెల్మల్ రాజన్న కుటుంబ సభ్యులను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. రాజన్న తండ్రి కోమన్పల్లి ముత్తి లింగం(85) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. లింగం మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఆయన మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీటీసీ గాదారి శ్రీధర్, దారం సురేశ్, ఎర్రం లింగం తదితరులు ఉన్నారు.