ఖలీల్వాడి, ఫిబ్రవరి 24: దేశం చూపంతా రాష్ట్రంవైపే ఉన్నదని, తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిజామాబాద్లో ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం టీఎన్జీవోస్ 34వ జిల్లా స్థాయి అంతర శాఖల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగులు జీతాలు, ప్రమోషన్లు, పీఆర్సీ విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని వివరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదని.. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగులకు ఇస్తున్న పీఆర్సీని వారికి ఇచ్చి ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. గతంలో ప్రమోషన్లు, పీఆర్సీల కోసం సూట్కేసులు పట్టుకొని సచివాలయం చుట్టూ దళారులు తిరిగేవారని కానీ తెలంగాణ వచ్చిన అనంతరం ఆ పరిస్థితి లేదని తెలిపారు. నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
ఉద్యోగులకు జీతాలు పెంచితే కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పేరుతో దోపిడీ చేస్తున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ప్రైవేటీకరణ చేసి ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణకే ఎక్కువ అవార్డులు వస్తున్నాయని దానికి కారణం ఉద్యోగుల పనితీరేనని కొనియాడారు. జిల్లాలో మెరిసిన ఆణిముత్యం ప్రపంచ స్థాయి బాక్సర్గా నిఖత్ జరీన్ ఎదగడంతో ఆమెను సీఎం కేసీఆర్ గౌరవిస్తూ డీఎస్పీ ఉద్యోగం, 600 గజాల స్థలం ఇచ్చినట్లు తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా జిల్లాలో స్టేడియం కావాలని కోరాగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు. తాను నిజామాబాద్కు వస్తున్నట్లు తెలిసిన ఎమ్మెల్సీ కవిత జిల్లా ప్రజలకు ఏమి కావాలో అది ఇచ్చేయాలని కోరారని చెప్పారు. జిల్లాలో జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అండగా ఉన్నారన్నారు, ఉద్యోగులంతా జిల్లాలో బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి అమృత్కుమార్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ల రాజేందర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, నగర మేయర్ దండు నీతూకిరణ్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
అన్ని కులాల అభ్యున్నతే సీఎం లక్ష్యం ..
అన్ని కులాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గౌడ కులస్థులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తుల వారికి సముచిత న్యాయం చేస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న మద్యాన్ని నిషేధించాలని, అందుకు ఎక్సైజ్ అధికారులు కృషి చేయాలన్నారు. గీత కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని సూచించారు. నీరా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గీత కార్మికులు చెట్లను తప్పకుండా పెంచాలన్నారు. గు డుంబాని నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో పాటు మారయ్యగౌడ్, గౌడ సంఘ నాయకులు చెరుకు లక్ష్మణ్గౌడ్, నర్సాగౌడ్, జయసింహాగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.