రెంజల్, జనవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అమర్సింగ్ తెలిపారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయం లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలో 70 టీంలను ఏర్పాటు చేశామన్నారు.
గతంలో పరీక్షలు నిర్వహించిన వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలను అందిస్తామని డీఎంహెచ్వో సుదర్శనం అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే కంటి వెలుగు బృందానికి ప్రజలు సహకారించాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రాములు, ఎంపీడీవో శంకర్, మండల వైద్యాధికారి వినయ్, జిల్లా విస్తీర్ణ అధికారి గోవర్ధన్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు రవీందర్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.