కంఠేశ్వర్, ఫిబ్రవరి 25 : బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహించిన 41వ జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు.. కేరళ జట్టుపై 10-9 తేడాతో విజయం సాధించింది.
రాష్ట్ర జట్టు గెలుపులో జిల్లా క్రీడాకారులు అజ్మీరా ఇందు (కెప్టెన్), గోక శ్రావిక, గోక సాత్విక, కెతావత్ సోని కీలకపాత్ర పోషించి బంగారు పథకాలు అందుకున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా చైర్మన్ బద్దం లింగారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు శోభన్బాబు, అభిషేక్గౌడ్, ఇండియా కోచ్ కృష్ణ, సంగీతారావు, టి.విద్యాసాగర్రెడ్డి, బొజ్జ మల్లేశ్, నీరజారెడ్డి, జైపాల్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.