సదాశివనగర్, డిసెంబర్ 20 : మాస్టర్ ప్లాన్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని, రైతుల పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ హామీ ఇచ్చారు. మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతులతో మంగళవారం సమావే శం ఏర్పాటుచేసి మాట్లాడారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగా కొందరు రైతులకు చెందిన వ్యవసాయ భూములు పోతాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయంలో రైతులు నష్టపోకుండా చూడాలని ఈ నెల 7న మంత్రి కేటీఆర్కు లేఖను అందించినట్లు గుర్తుచేశారు. ఇది రైతు ప్రభుత్వమని, అన్నదాతల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు శ్రీనూ నాయక్, సర్పంచ్ జానకీ జనార్దన్, విండో చైర్మన్ సదాశివరెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీరాజలింగం, రేణుకా నర్సింహులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుమ్మరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.