ఖలీల్వాడి, నవంబర్ 20: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ నాలుగేండ్లలో జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పథకం, ఆసరా పింఛన్లు, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాల్లో కేంద్రానివి ఎన్ని నిధులున్నాయో చెప్పాలని అన్నారు. పసుపు బోర్డు తీసుకురానందుకు రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సరుకు లేని సన్యాసులే మతం, కులాలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ పొలిటీషియన్ కాదని, పొల్యూషన్ అని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అర్వింద్ తన అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడని మండిపడ్డారు. కేసీఆర్ది ఫైటర్స్ ఫ్యామిలీ అని, ధర్మపురి అర్వింద్ది చీటర్స్ ఫ్యామిలీ అని ధ్వజమెత్తారు.
బూతు పురాణానికి అంబాసిడర్ అని, నోరు తెరిస్తే సొల్లు పురాణమన్నారు. బడికివెళ్లే వయస్సులో బార్ షాపుల చుట్టూ తిరిగిన బట్టేబాజ్కు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ధర్మపురి కుటుంబమే ఒక అవినీతి కూపమని ఘాటుగా విమర్శించారు. వాళ్లు ధరించే దుస్తులు, తినే తిండి కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. రాజస్థాన్లో అర్వింద్ చదువు ఒక ఫేక్ అని ఆరోపించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అడ్డూ అదుపు లేకుండా అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు.
అది మనిషి అనే వాడు ఉపయోగించే భాషేనా అని ప్రశ్నించారు. కేటీఆర్, కవితను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేని అర్వింద్ బూతు పురాణానికి దిగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలతో బతుకుతున్న అర్వింద్ ఒక జోకర్, బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. అర్వింద్ మాటలు అబద్ధాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ టక్కరి గేమ్ ఆడుతూ కవితను బ్లేమ్ చేసే కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. అర్వింద్ తప్పుడు మాటలకు చెప్పులతో కొట్టడం చిన్నమాట అని, తామైతే ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఆయన బట్టలూడదీసి ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు.
బండిది మత రాజకీయమని, అర్వింద్ది కుల రాజకీయమని విమర్శించారు. రాష్ట్రంలో మతాల మంట పెట్టాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. కొత్తగా అర్వింద్ కులాల కుంపటి రగిలించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల ఇండ్లపై బీజేపీ గూండాలు దాడిచేసినప్పుడు గవర్నర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
గవర్నర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదని, మోదీ,షాల కమల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జీవన్రెడ్డి విమర్శించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, అలీం, సిర్పరాజు, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.