తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక.. ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక.. బతుకమ్మ. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగి, సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ప్రకృతిని, పూలను పూజించే ఈ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకునేందుకు మగువలు సిద్ధమయ్యారు. గునుగు, తంగేడు, కట్ల, తురాయి, బంతి, మందార.. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజించనున్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా సర్కారు సారెను అందిస్తున్నారు.
బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 24 : తెలంగాణ ఆడ బిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తుందంటే 15 రోజుల నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అద్దం పట్టేవిధంగా ఆడ పడుచుల ఆటలు, బతుకమ్మ పాటలతో గ్రామీణ పాంతాలు మారుమోగుతాయి. బతుకమ్మ పండుగకు ముందు గ్రామాల్లో ఆడ పిల్లలు నిర్వహించే బొడ్డెమ్మ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భాద్రపద బహుళ పంచమి మొదలు నుంచి బొడ్డెమ్మల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మ సంబురాలు మహాలయ అమావాస్య (పితృ అమావాస్య) వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నేటి నుంచి బతుకమ్మ పండుగ ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న జరుపుకొనే సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. రూ. 339. 73 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఆడబిడ్డలకు చీరెల పంపిణీ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది.
పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్లెం (తాంబూలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్య లో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉం టుంది. తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పెడ్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడ్తారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమ ర్చి, కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అంద రూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తి స్తూ పాడుతారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవా రు వాయినాలు ఇ చ్చి పుచ్చుకుంటా రు. చివరి రోజు సాయంత్రం,ఆడపడుచులు అంద రూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెట్టి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్య త, సోదరభావం, ప్రేమను కలిపి మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడ్తారు.
ధర్మాంగతుడు అనే చోళ చక్రవర్తి దక్షణపథాన్ని పాలించేవాడు. పే రుకు తగ్గట్టుగానే ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన భార్య సత్యవతి. ఓ యుద్ధంలో ఆయన తన రాజ్యాన్ని కోల్పోయి భార్య సత్యవతితో కలిసి అడవులకు వెళ్తాడు. ఆ తర్వాత ఆయన శ్రీ మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తా డు. కొంత కాలానికి లక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకొమ్మని అ డుగుతుంది. తమకు సంతానం లేక బాధ పడుతున్నామని, నీవే తమ కుమార్తెగా జన్మించాలని వేడుకుంటారు. అందుకు శ్రీ మ హాలక్ష్మి దేవి సంతోషించి వరాన్ని ప్రసాదిస్తుంది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీ దేవి జన్మిస్తుంది. ఆ బాలికను చూసి మునులు, రుషులు, పం డితులు ఎంతో సంతోషించి బ తుకమ్మ అని దీవిస్తారు. ఆ నాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు చ క్రంశకుడు అనే రాజుగా జన్మించి బతుకమ్మను వివాహమాడుతా డు. ఆ దంపతులు సిరిసంపదలతో రాజ్యపాలన చేశారనే పౌరాణిక గాథ ప్రచారంలో ఉన్నది.
సీమాంధ్ర పాలనలో బతుకమ్మ పండుగకు ఆదరణ కరువైంది. రాష్ర్టాన్ని సాధించాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మం జూరు చేసింది. బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకోవాలని గొప్ప సంకల్పంతో 2017 నుంచి 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరెలను ఆడబిడ్డలకు పంపిణీ చేసింది. ఈ సంవత్సరం 10 రంగులు, 24 డిజైన్లతో చీరెలను తయారు చేయించి కోటి మంది ఆడపడుచులకు చీరెలను అందించనున్నది. బతుకమ్మ పండుగ కీర్తిని ప్రపంచానికి చాటేందుకు జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత విశేషంగా కృషి చేశారు. అక్టోబర్ 3న హైదరాబాద్లోని లాల్బహుదూర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మతో ము గింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
బీర్కూర్, సెప్టెంబర్ 24 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతిరూపం బతుకమ్మ వేడుకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బొడ్డెమ్మల అనంతరం బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. కామారెడ్డి డివిజన్తో పాటు నిజామాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భాద్రపద బహుళ త్రయోదశి రోజు మొదటి బతుమ్మను పేర్చుతారు. బోధన్, బాన్సువాడలలో పెత్తర అమావాస్య (మహాలయ అమావస్య ) మరుసటి రోజు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. దీనినే ఎంగిలి పూల అమాస అని కూడా పిలుస్తారు. గునుగు, గుమ్మడి, టేకు, తురాయి పూలతో బతుకమ్మలను పేర్చుతారు. ఈ క్రమంలో బొడ్డెమ్మను, దాచి ఉంచిన పూలను తొలి బతుకమ్మలో పెడతారు. అనంతరం ప్రధాన కూడలి వద్దకో, గ్రామంలోని ఆలయం వద్దకో తీసుకెళ్లి బతుకమ్మ ఆడి చెరువు ల్లో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా బతుకమ్మకు రోజు ఒక నైవేద్యం సమర్పిస్తారు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పేడ బొడ్డెమ్మలను తయారు చేస్తారు. అయితే వీటిని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను తయారు చేసేందుకు పుట్టమట్టి, ఆవుపేడ తీసుకొని వచ్చి ముత్తయిదువలను పిలిచి వారితో కలిసి వెడల్పాటి చెక్కపై ఐదు వరుసలు గుండ్రంగా చతురస్రాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దానిపై కలశం పెడతారు. అందులో ప్రతి రోజూ బియ్యం పోస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి, నూతన వస్ర్తాలతో పసుపుతో తయారు చేసి గౌరమ్మను పెడతారు. సాయంత్రం ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేసి అందులో బొడ్డెమ్మలను పెడతారు. ఆ తర్వాత బొడ్డెమ్మల పాటలు పాడుతూ, పసుపు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి నిద్దురపో బతుకమ్మ నిద్దురపో అంటూ ఇలా 9 రోజుల పాటు బొడ్డెమ్మ తయారీలో పాల్గొని పూజలు చేస్తారు.
భాద్రపద బహుళ పంచమి మొదలు నుంచి గ్రామాల్లో బొడ్డెమ్మ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగకు ముందు 9 రోజుల నుంచి బొడ్డెమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పెళ్ళి కాని ఆడ పిల్లలు చేసే పండుగ ఇది.రోజూ ఇంటి ముందు కళ్లాపి చల్లి, ముగ్గులు వేసి అందులో రకరాల పూవ్వులను ఐదు కుప్పలుగా పోసి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. నీ బిడ్డ పేరేమీ కోల్ అంటూ ఆడుతారు. ఆట పూర్తయ్యాక పువ్వులను ఆడబిడ్డ ఒడిలో పెట్టి అనంతరం వాటిని దాచి ఉంచుతారు. దాచి ఉంచిన పూలను ఎంగిలి పూలు అంటారు.
ఎంగిలి పూల బతుకమ్మను అమావాస్య రోజు పేరుస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, బెల్లం, చక్కెర వాడతారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాల్లో భాగంగా రెండో రోజును అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు సప్పటి పప్పు, బెల్లం, అటుకులు, ప్రసాదంగా స్వీకరిస్తారు.
మూడో రోజు పేర్చే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం ప్రసాదంగా ముద్దపుప్పు, బెల్లం, పాలతో తయారు చేసిన పాయసాన్ని స్వీకరిస్తారు.
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మగా పిలుస్తారు. పాలు, బెల్లం, నానపెట్టిన బియ్యంతో పాయసం తయారు చేసి ఒకరినొకరు ఇచ్చుకుంటూ ప్రసాదంగా తీసుకుంటారు.
ఐదో రోజు పేర్చే బతుకమ్మను అట్ల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం బియ్యం పిండితో వేసిన అట్ల (దోశలు)ను ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజు అరిష్టంగా భావించి బతుకమ్మ పేర్చరు, ఆడరు. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మను పేర్చినా ప్రసాదం ఏమీచేయరు.
ఈ రోజు బతుకమ్మను పేర్చి ప్రసాదంగా సకినాలు చేసి పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దలు చేసి నూనెలో వేయించి ప్రసాదంగా తీసుకుంటారు.
వెన్నముద్దల బతుకమ్మగా పిలిచే బతుకమ్మ పండుగ రోజు నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన ఫలహారం ఈ రోజు ప్రత్యేకం.
బతుకమ్మ సంబరాల్లో చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఈ రోజు ఫలహారం పెరుగన్నం సద్ది, చింతపండు, నిమ్మరసంతో తయారు చేసిన పులిహోర, కొబ్బరి తురు ము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది, సద్దుల బతుకమ్మ రోజు వండి తినే ప్రసాదాలు.