కోటగిరి, సెప్టెంబర్ 23 : సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని, గర్భిణులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి ఆశకార్యకర్తలతో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్సెంటర్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. సీహెచ్సీలో నెలలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని స్టాఫ్ నర్స్ శిల్పను అడిగి తెలుసుకున్నారు.
15 నుంచి 20 డెలివరీలు చేస్తున్నామని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట ఆరోగ్య విస్తర్ణ జిల్లా అధికారి గోవర్ధన్, హెల్త్ సూపర్వైజర్లు జ్యోతి, సాయికుమారి, ఏఎన్ఎం శ్రీదేవి, ఆరోగ్యమిత్ర సంబాజీ ఉన్నారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంట సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని అడిగి నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట స్పెషల్ అఫీసర్ రూప, ఉపాధ్యాయులు ఉన్నారు.