కమ్మర్పల్లి, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ నిండైన ప్రేమ ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా మహిళలకు అన్నగా, పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ పంపిస్తున్న పుట్టింటి కానుక బతుకమ్మ చీర అని అన్నారు. కమ్మర్పల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణపై కేసీఆర్కు ఉన్న ప్రేమ, రాష్ట్రం బాగుండాలనే ఆర్తి సంక్షేమ పథకాల్లో ఉందన్నారు. ప్రజలు జరుపుకొనే పండుగను ప్రభుత్వం గుర్తిస్తే ఆ పండుగకు రాజ ముద్ర పడుతుందన్నారు. గత పాలకుల హయాంలో సంక్రాంతికి ఇచ్చిన ప్రాధా న్యం బతుకమ్మకు ఉండేది కాదని కవిత గుర్తుచేశారు. మన ప్రభుత్వం వచ్చాక బతుకమ్మను గుర్తించి ఘనంగా జరుపుకొంటున్నామన్నారు. ఆడబిడ్డలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ కిట్టు కార్యక్రమాన్ని ఆయన ఎంతో పెద్ద మనసుతో రూపొందించారన్నారు.
మతం పేరుతో ఆగం జేస్తుండ్రు..
కొంత మంది ప్రజలను విడ గొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. కేంద్రంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్న బీజేపీ.. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇవ్వరు.. కానీ మతం పేరు చెప్పి ఆగం చేస్తారని విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎంపీ అర్వింద్ను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. జై శ్రీరామ్ అంటే మనం కూడా జైజై శ్రీరాం అందాం.. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు కావాలనేది కూడా ముఖ్యమే కదా అన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకొందామన్న కవిత.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మను విశ్వ వ్యాపితం చేసిన ఘనత కవితది- మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
బతుకమ్మ ప్రాధాన్యం తగ్గిపోతున్న రోజుల్లో ఆ పండుగను విశ్వ వ్యాపితం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవితది అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. అందరి ముఖాల్లో చిరు నవ్వులు చూడాలని సీఎం కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా మానవీయ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తాజాగా స్వచ్ఛ భారత్ గ్రామీణ్ విభాగంలో నిజామాబాద్ జిల్లాకు మూడో స్థానం దక్కిందంటే పారిశుద్ధ్యం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్లే కదా అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు 22 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చే వారని, ఇందుకు రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు చేసే వారని గుర్తు చేశారు. ఇప్పు డు కేసీఆర్ 42 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నది కేవలం తెలంగాణలో మాత్రమే అన్నారు.
ఇలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు లేవో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీగౌడ్, రాష్ట్ర మహి ళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొత్తూర్ లక్ష్మారెడ్డి, ఈగ గంగారెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్, రాజారాం యాదవ్, ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, డీపీవో జయ సుధ, ఆర్డీవో శ్రీనివాసులు, డీసీవో సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
కవితక్క చెప్పింది నిజం
బతుకమ్మ చీరెలు పంపతున్నది ఏదో ఉత్తుత్తగ కాదు. తెలంగాణల ఊళ్లల్ల నాటి సంది బతుకమ్మ, దసరా పెద్ద పండుగులు. గసుంటి పండుగులకు మహిళలకు పెద్ద మనసుతో కేసీఆర్ పుట్టింటి కానుక లెక్క పంపతున్నడని కవితక్క సెప్పిందాంట్లో వంద శాతం యదార్థం ఉన్నది.
-ఆశమ్మ, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి మండలం
కేసీఆర్ సల్లగుండాల..
మాకు పండక్కి కొత్త చీరె ను తండ్రి లెక్క కేసీఆర్ పంపిస్తున్నడు. ఆ సారు సల్ల గుండాలె. ఆయనే ఎల్లకాలం ఉండాలె. మా యసుటోళ్లకు తం డ్రి లాగా..అన్న లాగా ఉన్నట్లుంటది.
-రాధ, హాసాకొత్తూర్
కేసీఆర్ రాకుంటే గిట్ల సీరె సారె రాక పోతుండే
కేసీఆర్ సారు సీఎంగా రాక పోయి నట్లయితే గిట్ల మాకు సీరె సారెలు రాక పోతుండే. అన్నదమ్ముడు తోడ వుట్టిన అక్క సెల్లెండ్లకు ఇచ్చినట్లు దసర దసరాకూ ఇత్తున్నడంటే ఎంత ప్రేమ గుణం ఉండాలె.
-పెద్ద సత్తెమ్మ, హాసాకొత్తూర్,కమ్మర్పల్లి మండలం
కొత్త చీరె కూడా లేని వాళ్లుంటుండే
బతుకమ్మ, దసరాకు కొత్త చీరె సుక కొను క్కోలేని వాళ్లు ఉంటుండే. ఆరేండ్ల నుంచి కేసీఆర్ కొత్త చీరె కొనుక్కునే తాహతున్నోల్లకు లేనోల్లకు అందరికీ సారె పంపుతు న్నడు.
-లక్ష్మి, కమ్మర్పల్లి