విద్యానగర్/ భిక్కనూర్, సెప్టెంబర్ 17 : అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎం జె.ప్రియదర్శిని శనివారం కామారెడ్డి కోర్టుకు వచ్చారు. అంతకు ముందు ఆమెకు ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, అదనపు రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కోర్టును సందర్శించారు.
పలు సమస్యలను బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం హైకోర్టు జడ్జి ..కామారెడ్డి కోర్టు జడ్జి శ్రీదేవి, మొబైల్ కోర్టు జడ్జి వెంకటేశ్ ధృవతో కలిసి భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ని దర్శించుకున్నారు. అభిషేకం, ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఈవో శ్రీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమృతరావు, న్యాయవాదులు భిక్షపతి, శ్రీధర్, శ్రావణ్ గౌడ్, జగన్నాథం, వెంకటరాంరెడ్డి, రాజగోపాల్, సీఐ తిరుపయ్య, అర్చకులు రామగిరి శర్మ, సిద్దగిరి శర్మ, సిద్దేశ్, సిబ్బంది పాల్గొన్నారు.