రాష్ట్రంలోని గిరిజనులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు మాదిరిగానే గిరిజన బంధు అమలుచేసి తీరుతామని చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొని గిరిజన బిడ్డలకు తీపి కబురు వినిపించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– లింగంపేట/ గాంధారి/ కోటగిరి/బోధన్ రూరల్, సెప్టెంబర్ 17
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్పై ప్రకటనతో గిరిజనులకు ఊరట లభించింది. గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రమావత్ రాజు, సర్పంచ్, బెల్లాల్
గిరిజన బంధు పథకం అమలు చేస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. దళితుల అభివృద్ధికి అమలు చేసిన దళితబంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు ప్రకటన ప్రతి ఒక్కరి ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధికి ఎంతగానో దోహదపడుతుంది. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-దేగావత్ దూప్సింగ్ నాయక్, కౌన్సిలర్, బోధన్ మున్సిపల్
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అమలు, గిరిజన బంధు పథకం అమలు విషయాల్లో సీఎం కేసీఆర్ ప్రకటనతో గిరిజనుల కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్ చేపట్టే ఈ అంశాల కారణంగా ఉద్యోగావకాశాలు పెంపొందే అవకాశాలు పెరుగుతాయి. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రతి గిరిజన నాయకుడు, యువకులు, కుటంబాలు రుణపడి ఉంటాయి. సీఎం కేసీఆర్కు గిరిజనుల తరపున కృతజ్ఞతలు.
-నేనావత్ విఠల్ నాయక్, ఉప సర్పంచ్, రాజీవ్నగర్ తండా
గిరిజన బంధు పథకం నిరుపేద గిరిజనులకు బాసటగా నిలుస్తుంది. అటవీ ప్రాంతంలో జీవించే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిరుపేద గిరిజన కుటుంబాల వారు అభివృద్ధి సాధించగలుగుతారు. కూలీ పనులు చేసుకొనే వారు జీవన ప్రమాణాలు పెంచుకోగలుగుతారు. గిరిజనులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– గన్ను నాయక్, బంజారా సేవా సంఘం, లింగంపేట మండల శాఖ అధ్యక్షుడు
ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. పది శాతం రిజర్వేషన్తో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సీఎం కేసీఆర్ను గిరిజనులు జీవితాంతం తమ గుండెల్లో ఉంచుకుంటారు.
– కేతావత్ బలరాం నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గాంధారి మండలం
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమైన విషయం. 10 శాతం రిజర్వేషన్తో చాలా మంది గిరిజన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వచ్చే నోటిఫికేషన్లు అన్నింట్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి
– ప్రకాశ్నాయక్, పీఆర్టీయూ గాంధారి మండల అధ్యక్షుడు
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని ప్రకటించడం అభినందనీయం. గిరిజన బంధుతో గిరిజన కుటుంబాల్లో గొప్ప మార్పు రానున్నది. సీఎం కేసీఆర్ గిరిజనుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.
-ప్రేమ్దాస్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, గాంధారి మండలం
గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. పది శాతం రిజర్వేషన్తో వెనుకబడి ఉన్న గిరిజనులకు ప్రయోజనం కలుగుతుంది. కేసీఆర్ను గిరిజనులు జీవితాంతం గుర్తుంచుకుంటారు.
-రవీందర్నాయక్, దుర్గం, సర్పంచ్, గాంధారి మండలం
సీఎం కేసీఆర్ గిరిజనులకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ ఒక గొప్ప వరం. కేసీఆర్ సారు చేతల మనిషి. ఏన్నో ఏండ్లుగా ఎదురు చూసిన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్ పుణ్యమా అని సాకారమవుతున్నది. రిజర్వేషన్ పెంచడం చాలా సంతోషంగా ఉంది.
– వివేక్, సర్పంచ్ జల్లాపల్లి అబాది, కోటగిరి మండలం