నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 2 : భర్తను కాదని క్రిమినల్తో వివాహేతర సంబంధం పెట్టుకొని కన్న కూతురినే హతమార్చిన తల్లి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ నాగరాజు శుక్రవారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన కాపర్తి గురునాథం.. ఆయన భార్య దుర్గాభవాని, కూతుళ్లు నాగలక్ష్మి(6), గీతా మాధురితో ఆరు నెలల క్రి తం నిజామాబాద్కు వలస వచ్చాడు. ఇక్కడ సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో దుర్గాభవానీ పాత నేరస్తుడైన డ్యారంగుల శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. గురునాథం తల్లి చనిపోవడంతో అతడు విజయవాడ వెళ్లాడు. దుర్గాభవాని ఇద్దరు పిల్లలతో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఏరియాలో ఉంటున్నది.
వివాహేతర సం బంధానికి అడ్డువస్తుందనే నెపంతో పెద్ద కూతురు నాగలక్ష్మిని ప్రియుడైన డ్యారంగుల శ్రీనుతో కలిసి ఆగస్టు 31వ తేదీన గొంతునులిమి చంపేసి, మృతదేహాన్ని మాక్లూర్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ కేసుపై నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, సీసీఎస్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ 1098 ఆధ్వర్యంలో తమదైన శైలిలో దర్యాప్తు నిర్వహించి పాత నేరస్థుడైన శ్రీను, దుర్గాభవానీని మాక్లూర్ ఏరియాలో శుక్రవారం అరెస్టు చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు.
నిందితుడి నుంచి రెండు బైక్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. ఈ కేసు ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, నార్త్ సీఐ నరహరితో పాటు వారికి సహకరించిన ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష, మాక్లూర్ ఎస్సై యాదగిరి, రైల్వే చైల్డ్ డెస్క్ 1098 సభ్యులు, సీసీఎస్ సిబ్బంది శ్రీనివా స్, శైలేశ్, వేణుగౌడ్, అఖిల్ను సీపీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
పాత నేరస్తుడైన డ్యారంగుల శ్రీనుపై గతంలో మోపా ల్, డిచ్పల్లి, మాక్లూర్, బోధన్ రూరల్, రుద్రూర్ పోలీస్ స్టేషన్లలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.