ఖలీల్వాడి, సెప్టెంబర్ 2: తెలుగువారి కోడలు నిర్మలా సీతారామన్ అబద్ధాలకు రోల్ మోడల్ అని నిరూపించుకున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా పర్యటనకొచ్చి అవగాహన లేకుండా మాట్లాడి పరువు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ‘మోదీ బొమ్మ ప్లెక్సీలో ఉంటుందని, మా కేసీఆర్ బొమ్మ ప్రజల గుండెల్లో ఉంటుందని.. నిర్మలమ్మ పర్యటన తెలంగాణ ప్రజల కోసం కాదు ఓట్లు, సీట్ల కోసమన్నారు. అందమైన తెలంగాణ పచ్చని ప్రకృ తి సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెట్టడం కోసం, సింగరేణి బొట్టు గనులను అమ్మడం కోసం కానీ మీ ఆటలు ఇక్కడ సాగవన్నారు.
తమ నాయకుడు కేసీఆర్ ఒక వ్యక్తి కాదు.. మహాశక్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ మోడల్ కావాలా ? ఆరు వందలకు మించి పెన్షన్లు ఇవ్వని గుజరాత్ బేరగాళ్ల మోడల్ కావాలా ? రూ.2016, 3016 పెన్షన్లు ఇస్తున్న కేసీఆర్ మోడల్ కావాలా ? మోటర్లకు మీటర్లు పెట్టే మోదీ కావాలా ? 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న కేసీఆర్ కావాలా ? దళితబంధు ఇచ్చే కేసీఆర్ కావాలా ? దళితులు అంటే గౌరవం లేని మోదీ కావాలా అని ప్రశ్నించారు.
మతం పేరుతో మంట పెడుతున్న బీజేపీ కావాలా.. పచ్చని పంటలకు కర్మ, కర్త క్రియ సన్నబియ్యం ఇచ్చే కేసీఆర్ కావాలా అని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో వేస్తామని చెప్పి మోదీ మోసగించారన్నారు. లోకల్ బ్యాచ్ రాసిచ్చిన తప్పుడు స్క్రిప్ట్తో అబద్ధాలు చెప్పిన నిర్మలా సీతారామన్ పరువు తీసుకున్నారన్నారు. మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆమె ఫొటోల పంచాయతీ పెట్టారని జనం నవ్వుకుంటున్నారన్నారు. రైల్వే స్టేషన్లు, ఎల్ఐసీ, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు అమ్మే ప్రధాని మనకొద్దని జీవన్రెడ్డి స్పష్టం చేశారు.
కవిత పసుపు బోర్డు కోసం నిరంతరం పోరాడారు. పసుపు సాగు చేసే రాష్ర్టాల సీఎంల నుంచి లేఖలు సాధించారు. కేంద్ర మంత్రులను కలిశారు. పార్లమెంటులో గొంతెత్తారు. చివరకు ప్రైవేటు బిల్లు అస్ర్తాన్ని సంధించారు. ఆమె ఇంతగా పోరాడినా టీఆర్ఎస్కు పేరు వస్తుందనే భయంతో బీజేపీ పసుపుబోర్డు ఇవ్వలేదు. అర్వింద్ గెలుపే బోర్డు ఏర్పాటుకు శాపమైంది.
-గడ్డం లింగారెడ్డి, గుమ్మిర్యాల్, ఏర్గట్ల