బోధన్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ నాయకత్వాన్నిమరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని బోధన్లోని క్యాంప్ కార్యాలయంలో, నవీపేట మండల కేంద్రంలో, రెంజల్ మండలం సాటాపూర్, ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో గురువారం నాయకులు, కార్యకర్తల సమావేశాలను
సీఎం కేసీఆర్ హాజరుకానున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని, ఇందుకు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మండలాల వారీగా ప్రత్యేకంగా వాట్సాప్గ్రూపులు ఏర్పాటు చేసి సమన్వయం చేస్తామన్నారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు సభను విజయవంతంచేయాలన్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి సభకు హాజరయ్యే వారి సౌకర్యార్థం 200 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బోధన్లో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, గిర్దావర్ గంగారెడ్డి, గోగినేని నర్సయ్య, సిర్ప సుదర్శన్, గింజుపల్లి శరత్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వేంకటేశ్వరరావు దేశాయ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, భవానీపేట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నవీపేటలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, నవీపేట, బినోల సొసైటీల చైర్మన్లు న్యాలకంటి అబ్బన్న, మగ్గడి హన్మాండ్లు, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీశ్, సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, బి.సూరిబాబు, నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్కుమార్, వి.కిశోర్రావు, పట్టణ అధ్యక్షుడు లోకం నర్సయ్య, బోధన్ నియోజక వర్గం నాయకులు ఎంఏ రజాక్, అల్లం రమేశ్, మైనార్టీ నాయకులు తాహెర్, అర్షద్, ఆప్సర్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, సాటాపూర్లో నిర్వహించిన సమావేశంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు భూమారెడ్డి, నీలా, రెంజల్ విండో చైర్మన్లు ఇమ్రాన్బేగ్, సర్పంచులు రమేశ్కుమార్, ఖలీంబేగ్, సాయిరెడ్డి, సాయిలు, వికార్పాషా, ఎంపీటీసీలు, నాయకులు రఫీక్, రాఘవేందర్, నర్సయ్య, కాశం సాయిలు, వసంత్, తదితరులు పాల్గొన్నారు.
కుర్నాపల్లిలో నిర్వహించిన సమావేశంలో జడ్పీవైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కె.శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరామ్, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, సర్పంచులు, ఎంపీసీటీలు తదితరులు పాల్గొన్నారు.