డిచ్పల్లి, సెప్టెంబర్ 1 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో కొత్తగా మంజూరైన 1,500 మందికి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలు అడగకముందే అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారన్నారు. ప్రధానిగా మోదీ ఎనిమిదేండ్లలో 70 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు లేవన్నారు. గుజరాత్లో సైతం పేదలకు రూ.600 పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ను అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 64 వేల మందికి పెన్షన్లను ఇస్తున్నామని గుర్తుచేశారు. 70 శాతం మంది రైతులకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని, 80వేల మందికి రైతుబంధు ఇస్తున్నామని వివరించారు.
ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ మాట్లాడుతూ. మన పథకాలను చూసి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు.. తమను తెలంగాణలో కలుపుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి, డిచ్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతశ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాథోడ్ జగదీశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు ఆమేర్, మహిళా విభాగం అధ్యక్షురాలు గీత, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, లక్ష్మీనర్సయ్య, ఒడ్డం నర్సయ్య, విండో చైర్మన్లు గజవాడ జైపాల్, తారాచంద్, రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో కిషన్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్ను ఇందల్వాయి సహకార సంఘం చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఇందల్వాయి, డిచ్పల్లి మండలాలకు 2500 ఆసరా పింఛన్లను మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.
ఇందల్వాయి, సెప్టెంబర్ 1 : మండలకేంద్రంలోని గంగపుత్ర సంఘంలో 10 మందికి కల్యాణలక్ష్మి, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు ఆసరా పింఛన్లను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో కొత్తగా 1053 మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం పలు గ్రామాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు కాగా.. ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
ఇందల్వాయి గ్రామస్తులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సన్మానించారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ సభ్యురాలు గడ్డం సుమనా రవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, స్థానిక ఎంపీటీసీలు మారంపల్లి సుధాకర్, చింతల దాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచ్ పాశం సత్తెవ్వ, డీసీసీబీ డైరెక్టర్ కోరట్పల్లి ఆనంద్, సీనియర్ నాయకులు పాశంకుమార్, గోపాల్, ముత్తెన్న, రఘునందన్రావు, తేలు విజయ్కుమార్, నరేశ్, శేఖర్, సత్యనారాయణ, విఠల్రెడ్డి, నోముల విజయలక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.