ఇందూరు, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మూడు కేటగిరీల్లో రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయని డీఈవో దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ జడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న ఎస్.సురేశ్ (గెజిటెడ్ హెడ్మాస్టర్ ), జక్రాన్పల్లి జడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న డాక్టర్ హజారే శ్రీనివాస్ (ఎస్ఏ) , బా ల్కొండ మండలం బస్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బి.నర్సయ్య(ఎస్జీటీ), కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న పి.ప్రవీణ్కుమార్ (ఎస్ఏ)కు ప్రభు త్వం అవార్డులు ప్రకటించినట్లు వివరించారు.