వర్ని, ఆగస్టు 19 : బీజేపీ నాయకుడి వైఖరి కారణంగా వర్ని మండల కేంద్రంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు వచ్చిన బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న టీఆర్ఎస్ నా యకులను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నాయకులు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావర ణం నెలకొన్నది. రుద్రూరు సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు అనిల్ రెడ్డి, రవీందర్, రాము అక్కడ ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి కొంతసేపు దుకాణాలను మూసివేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ అనుచిత వ్యా ఖ్యలు చేసినందుకు గాను సదరు బీజేపీ నాయకుడిని విమర్శిస్తూ మండల కేంద్రానికి చెందిన ఒక టీఆర్ఎస్ కార్యకర్త వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. దీంతో మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేసి పరుషపదజాలంతో దూషించినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై వర్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తమను బీజేపీ నాయకులు దూషించారని వారు ఆరోపించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృ ద్ధి పనులు చేస్తున్న స్పీకర్ను, కనీస మర్యాద లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు సూచించారు. ఏదైనా పోస్టు పెడితే దానికి అదే విధంగా సమాధానం ఇవ్వాలని కానీ దూషించడం సరికాదని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తమ కార్యకర్తను దూషించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు.