నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు చోట్ల రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. భీమ్గల్ దవాఖానలో జడ్పీటీసీ రవి, డీసీవో సింహాచలంతో కలిసి పండ్లను పంపిణీ చేశారు. కేజీబీవీలో విద్యార్థులకు ఏసీపీ ప్రభాకర్రావు పండ్లను పంపిణీ చేశారు. మోర్తాడ్ సీహెచ్సీలో రోగులకు వైద్యులు లక్ష్మి, రవి కుమార్ పండ్లు పంపిణీ చేశారు. ఏర్గట్లలోని మార్కుట్ వద్ద రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, తహసీల్దార్ జనార్దన్, పండ్లు పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని 100 పడకల దవాఖానలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ పండ్లను, మామిడిపల్లిలోని తపస్వీ తేజోనిలయంలో చిన్నారులకు పండ్లను, నిత్యావసర సరుకులను ఆర్మూర్ ఎస్హెచ్వో సురేశ్బాబు, ఎస్సైలు ప్రదీప్కుమార్, శ్రీకాంత్, అంకాపూర్లోని ప్రొద్దుటూరి సదానంద్రెడ్డి ఆశ్రమంలో వృద్ధులకు పండ్లను జిల్లా వైద్యశాఖాధికారి సుదర్శనం వేర్వేరుగా పంపిణీ చేశారు. ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, కమిషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, చిట్టాపూర్ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించామని సర్పంచ్ వనజ గోవర్ధన్గౌడ్ తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తహసీల్దార్ రాంచందర్, ఎంపీపీ రజిని, సర్పంచ్ రమేశ్కుమార్, ఎంపీడీవో శంకర్, వైద్యాధికారి ప్రకాశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు రఫిక్ పండ్లను పంపిణీ చేశారు. సాటాపూర్లో సర్పంచ్ వికార్పాషా, ఎంపీటీసీ హైమద్ అంగన్వాడీ పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు.
నవీపేట మండల కేంద్రంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్,ఎంపీడీవో గోపాలకృష్ణ,ఎంపీవో రామకృష్ణ, ఉద్యోగులు, ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శులు పేదలు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్.నాగరాజు సూచనల మేరకు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సౌత్ రూరల్ సీఐ నరేశ్తో కలిసి ఆరో టౌన్ ఎస్సై సాయికుమార్ నిర్మల వృద్ధ్దాశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. మోస్రా మండలం చింతకుంట వృద్ధాశ్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, జడ్పీటీసీ గుత్ప భాస్కర్రెడ్డి నాయకులతో కలిసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వైద్యకళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో పండ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ తండా, కేశాపూర్, మల్లారం, ధర్మారం(ఎం) తదితర గ్రామాల్లో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. బోధన్ పట్టణంలోని 24వ వార్డులో కౌన్సిలర్ సుధారాణి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో ఎస్సై రాము సిబ్బందితో కలిసి అమ్మ అనాథ ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలోని దయానంద్ సరస్వతీస్వామి శిష్యులు ఏర్పాటు చేసిన ఆలిండియా మూవ్మెంట్ ఫర్ సేవా ఆశ్రమంలో విద్యార్థులకు ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో జైకాంత్రి, విండో చైర్మన్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, రూరల్ సీఐ నరహరి, సర్పంచ్ శంకర్గౌడ్, దుస్తులు, నోట్బుక్స్, బూట్లు పంపిణీ చేశారు.