స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రజలు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతం ఆలపించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో వాహనదారులు రోడ్లపై ఎక్కడికక్కడ జాతీయగీతాన్ని ఆలపించారు. అనంతరం జైహింద్, జై భారత్ నినాదాలతో రోడ్లన్నీ దద్దరిల్లాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 16