మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఫరీద్పేటలో అభివృద్ధి పనుల ప్రారంభం
మాచారెడ్డి,జూన్ 21 : కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలంలోని ఇసాయిపేట, ఫరీద్పేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇసాయిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన జీపీ భవనంతోపాటు సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఫరీద్పేటలో 250 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు, జడ్పీటీసీ మినూకురి రాంరెడ్డి,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సర్పంచులు బక్కొల గాయత్రి, భాగ్యమ్మ,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్చంద్రం,కామారెడ్డి ఏఎంసీ చైర్మన్ గ్యార లక్ష్మి, వైస్ ఎంపీపీ నర్సింహారెడ్డి, కడెం లక్ష్మీనారాయణ,రాజాగౌడ్,యూత్విభాగం అధ్యక్షుడు షేక్ అజీజ్,బక్కొల బాలాగౌడ్,కొత్త అరవింద్, రంజిత్, శ్రీనివాసాచారి, బూక్య నర్సింహులు, హంజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.