డిచ్పలి/ఇందూరు, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు హరిప్రసాద్ అన్నారు. డిచ్పల్లిలోని మానవతాసదన్లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి ఆయనముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో, ప్రజాసైన్స్ వేదిక ఆధ్వర్యంలో రామకృష్ణ ఆశ్రమం ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్చాలెంజ్లో భాగంగా ఫారెస్ట్ కన్జర్వెటీవ్ ఆఫీసర్(హైదరాబాద్) ప్రభాకర్ నుంచి స్వీకరించిన గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్గంగారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సి.శ్రీకాంత్కు గ్రీన్చాలెంజ్ పంపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరాలకు ఆర్థిక వనరులను ఇస్తే సరిపోదని, సహజ వనరులను ఇచ్చినప్పుడే సుస్థితర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరానికి ‘సేవ్ ఎర్త్ ఓన్లీ వన్ ఎర్త్’ అనే నినాదాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ బాధ్యులు భూమేశ్వర్, ప్రజాసైన్స్ వేదిక బాధ్యులు ఘనపూర్ వెంకటేశ్వర్లు, సుశీల్కుమార్, గోవర్ధన్, పవన్, విద్యార్థులు పాల్గొన్నారు.
మానవతాసదన్లో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులు బాబురావు, సదన్ కేర్ టేకర్ రమేశ్, సిబ్బంది, గిరిరాజ్కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీత, ఎం కుమారస్వామి, ఎం.దస్తప్ప, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ కృష్ణ, సిబ్బంది భాగ్యలక్ష్మి, రంజిత్, నవీన్, లక్ష్మణ్, ధర్మపురి, మగ్గం వర్క్, టైలరింగ్ ఫ్యాకల్టీలు ఫరీదా, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.