కామారెడ్డి, మే 22 : ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగ యువతకు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల కోసం శిక్షణ తరగుతుల కొనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో వివిధ మండలాల నుంచి ఫ్రీ కోచింగ్ కోసం 912 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్టు ద్వారా 511 మందిని ఎంపిక చేశారు. వీరిలో ప్రస్తుతం 380 ఉద్యోగార్థులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. ఈ శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలోని ప్రణతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా రు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పర్యవేక్షణలో ప్రణతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తుమ్మ రమేశ్ నేతృత్వంలో 12 సబ్జెక్టులకు విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన నిష్ణాతులతో కోచింగ్ అందిస్తున్నారు. 75 రోజుల పాటు కోచింగ్ క్లాసులు కొనసాగనున్నాయి. ఉచిత కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలను అందించనున్నారు. ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు ప్రతిరోజూ మధ్యా హ్న భోజనం అందిస్తున్నారు.
ఖర్చులు ఆదా అవుతున్నాయి..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో కోచింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఉచిత కోచింగ్తో మాకు వేలాది రూపాయల ఖర్చు తగ్గుతుంది. మేము పోలీస్, గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఇక్కడ నిష్ణాతులైన ఫ్యాకల్టీలతో తరగతులు నిర్వహిస్తున్నారు.
-ఎస్ కుమార్