కామారెడ్డి, మే 22: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉచిత శిక్షణ తరగతులు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ సహకారంతో ఉద్యోగార్థులకు గ్రూప్స్, పోలీస్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులను హైదరాబాద్కు చెందిన శౌర్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు 75 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఫ్రీ కోచింగ్ కోసం మొత్తం 1,201 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 516 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరందరికీ ప్రత్యేకంగా గుర్తింపు కార్డుల అందించి తరగతులకు అనుమతిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. వారానికోసారి గ్రాండ్ టెస్టును నిర్వహించడంతో పాటు 75 రోజుల తర్వాత మరో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీలతో రూపొందించిన మెటీరియల్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో నోట్స్ యువతకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. శౌర్య అకాడమీకి చెందిన 12మంది వివిధ సబ్జెక్ట్ల్లో నిష్ణాతులైన వారితో కోచింగ్ నిర్వహిస్తున్నారు. కోచింగ్ నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భరిస్తున్నారు. ఉద్యోగార్థులకు ప్రభుత్వ విప్ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. గతంలో యూపీపీఎస్సీ, గ్రూప్స్లలో విజయం సాధించిన వారితో ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రైవేట్కు దీటుగా..
నేను వివిధ రకాల నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవు తున్నాను. వేలా ది రూపాయలు వెచ్చించి హైద రాబా ద్ తదితర ప్రాంతా లకు వెళ్లాల్సి న అవ సరం లేకుండా కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మాకు అన్ని రకాల సబ్జెక్టులను బోధిస్తున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మమ్ములను తయారుచేస్తున్నారు.
-మధు, అంతంపల్లి