నందిపేట్, మే 20 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మండలంలోని చౌడమ్మ కొండూర్ గ్రామంలో కొనసాగుతున్న అబివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, నందిపేట్ లక్కంపల్లి నుంచి సీహెచ్కొండూర్ వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణం వేగవంగా జరుగుతున్నప్పటికీ రోడ్డు పనులు మందగించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి జూన్ 2 లోగా పూర్తిచేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పనులను నిత్యం పర్యవేక్షిస్తూ నాణ్యత పాటించేలా చూడాలన్నారు. విద్యుత్ సంస్థ సమకూర్చాల్సిన సదుపాయాలపై ట్రాన్స్కో అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, ఏసీపీ ప్రభాకర్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.