ఇందూరు, మే 10 : ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రశ్నాపత్రాల బండిళ్లను సమయానికి తెరిచారా? నిబంధనలను పాటించారా అని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో స్వల్ప లోపాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎగ్జామిషన్ సెంటర్లో సదుపాయాల ను పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.రోజారాణి తదితరులు ఉన్నారు.
జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ బోధన్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను, పరీక్షల నిర్వహ ణ కమిటీ సభ్యులు ఆయా సెంటర్లను తనిఖీ చేశారు.
నాల్గో రోజు 893 మంది గైర్హాజరు
మంగళవారం నిర్వహించిన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు మొత్తం 17,800 మందికి గాను 16,907 మంది విద్యార్థులు హాజరు కాగా, 893 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ పరీక్షకు 2014 మందికి గాను 1813 మంది హాజరుకాగా, 201 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు.