ఇందూరు, మే 7 : తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఇందూరు ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కంజర్కర్ భూపతిరావు అధ్యక్షతన బ్రాహ్మణ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గంగస్థాన్లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్సీకి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేయర్ నీతూకిరణ్ ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం, పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటుకోసం కృషిచేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు భూపతిరావు మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు విగ్రహాన్ని జిల్లాలో ఏర్పాటుచేయాలని అనుకుంటున్నామని, స్థలం కేటాయించాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్కు రూ.100 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ బంధు ఇచ్చేలా చూడాలని, నగరంలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. నగర మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా సహకారంతో స్థలం కేటాయిస్తామన్నారు. అనంతరం నగరానికి చెందిన ఘనాపాటి మధుసూదనాశర్మను సన్మానించారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పీవీ తనయుడు, గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్రావు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు రాంప్రసాద్, కిరణ్ దేశ్ముఖ్, పిప్రికర్ శ్రీనివాస్రావు, బండారు రాంప్రసాదరావు, ఎర్రబాటి రామారావు, హైకోర్టు అడ్వకేట్ పూర్ణేకర్ శ్రీనివాస్, ఉదయ్కాంత్, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.