వేల్పూర్/ఏర్గట్ల, జూలై 5 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్గట్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ఏనుగు నవీన్, యూత్ నాయకులు ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోనగిరి దేవన్నతోపాటు పలువురు వేల్పూర్లో మంత్రి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, సొసైటీ డైరెక్టర్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏర్గట్ల సొసైటీ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, వైస్ చైర్మన్ సింగసారం గంగారాం, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దేవేందర్, నాయకులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, బోనగిరి రమేశ్, ఇట్టడి రాజు, బద్దం చిన్నారెడ్డి, గంగారాం నాయక్, బర్మ నర్సయ్య, క్యాతం దేవేందర్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.