విద్యానగర్, జూన్ 23 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న శారదాదేవి ఆలయంలో నవగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం గురువారం ముగిసింది. చివరి రోజు వేద పండితులు గంగవరపు ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా..స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ హాజరయ్యారు. ఆలయంలో వారు ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆలయాలు నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో వాటి పవిత్రతను కాపాడడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ప్రతిరోజూ పూజలు, అభిషేకాలు జరగాలని అన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి సీఎం ప్రత్యేక నిధి నుంచి నిధులు తెచ్చేందుకు విప్తో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికతతోనే ఆలయాల్లో దైవ త్వం, పవిత్రత ఏర్పడుతుందని అన్నారు. అనంతరం ఆల య కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో స న్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.