శక్కర్నగర్, మే 25: ప్రతి వ్యక్తి నిత్యం దైవ నామస్మరణ చేయడంతో పాటు దేవాలయాలను సందర్శించాలని మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నా రు. బోధన్ మున్సిపల్ పరిధిలోని శక్కర్నగర్ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన ఆరో వార్షికోత్సవానికి ఆయన హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలు విదేశీయులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, మన దేవతలను విదేశాల్లో ఆరాధిస్తున్నారని, ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నారు.
దైవనామ స్మరణతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, కష్టాలు దూరం అవుతాయని, ఇందుకు పురాణ గాధలు నిదర్శనమని తెలిపారు. అభయాంజనేయస్వామి ఆలయంలో నిత్యం దూప, దీప, నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తూ.. ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్న బృందాన్ని మహరాజ్ అభినందించారు.
వేద పండితుడు రత్నాకర్శర్మ మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హనుమత్ హోమం జరిపించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానిక కౌన్సిలర్ డెగావత్ ధూప్సింగ్ నాయక్తో పాటు ఆలయ ప్రతినిధులు పంపరి నవీన్, కృష్ణ, మల్లేశ్, కిరణ్కుమార్, నర్సింగ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి, మే 25: మండలంలోని మంగళ్పాడ్ శివారులో ఉన్న చెరువు కట్టపై గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శివగంగమ్మ ఆలయంలో విగ్రహ, శిఖర ప్రతిష్ఠపనోత్సవాలు బుధవారంతో పరిపూర్ణమయ్యాయి. కార్యక్రమాలను వేద పండితుడు రాజేశ్ జోషి మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాలకు మల్లా రం లింగేశ్వర గుట్ట వ్యవస్థాపకుడు బాలయోగి పిట్ల కృష్ణ మహరాజ్ హాజరయ్యారు. ఆలయంలో నిత్యం దూపదీప నైవేద్యాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకుడు కెప్టెన్ కరుణాకర్రెడ్డి, సర్పంచ్ బట్టు హన్మాండ్లు, ఎంపీటీసీ వనజా నాగరాజు, గంగపుత్ర సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
బోధన్, మే 25: బోధన్లోని మారుతీ మందిరంలో హనుమాన్ జయంతిని బుధవారం నిర్వహించారు. ఆలయ ఈవో రాంరెడ్డి ఆదేశాల మేరకు జూనియర్ అసిస్టెంట్ రాములు పర్యవేక్షణలో ఆలయ పూజారి ప్రవీణ్ మహరాజ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.