కోటగిరి, ఆగస్టు 18: టీఆర్ఎస్లో వలసల జోరు కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నా రు. గురువారం మండలంలోని ఎత్తొండ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి సమక్షంలో చేరగా వారికి ఆయన గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఇప్పటికే 10 వేలకుపైగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని మరో మూడు వేల ఇండ్లు మంజూరు కానున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోచారం శ్రీనివాసరెడ్డినే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించిన వారు ఇప్పటి వరకు గెలువలేదని ఒక ముద్ర, అనుమానం ఉన్నదన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీ తో గెలిపించి ఆ రాతను తిరగరాయాలని పిలుపునిచ్చారు. అనుక్షణం ప్రజల కోసం కష్టపడే నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిగిరి సాయిబాబా, జడ్పీటీసీ శంకర్పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఎంపీటీసీ ఫారుక్, విండో డైరెక్టర్ కిశోర్పటేల్, రఫీ, మాజీ సర్పంచ్ ఆనంద్, దేవేందర్, ఆగ్గు హన్మంత్, శ్రీనివాసరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.