వేల మాటలను మూట గట్టినట్లు.. కోటి భావాలు ఊసులాడినట్లు..ప్రకృతి తన అందాన్ని అద్దంలో చూసుకున్నట్లు, జ్ఞాపకాలు కరిగిపోనట్లు అనిపిస్తే అదే ఫొటో… ఆ ఫొటోను తీసే అద్భుతమైన కళే ఫొటోగ్రఫీ. వందల సంవత్సరాల క్రితం చీకటి గదిలో పుట్టి..ఎందరో శాస్త్రవేత్తల, ఔత్సాహిక వ్యాపారవేత్తల, ఫొటోగ్రఫీ కళాకారుల నిరంతర కృషితో రంగురంగుల కాంతి ప్రపంచంలోకి చేరింది ఫొటోగ్రఫీ. కన్ను మూసి తెరిచేలోగా గతంలో కలిసిపోయే ఎన్నో లిప్త పాటు దృశ్యాలను బంధించి శాశ్వత పరిచే కెమెరా కంటికి కళాత్మక దృష్టిని ఇచ్చే అద్భుత కళనే ఫొటోగ్రఫీ. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా నేడు వరల్డ్ ఫొటోగ్రఫీడే వేడుకలు జరుపుకొంటారు. కళగా ఎదిగి, లలిత కళల్లో ఒకటిగా చేరి, సామాజిక బాధ్యతను నెరవేస్తున్న ఫొటోగ్రఫీ పుట్టుక, పరిణామాన్ని ఈ సందర్భంగా తెలుసుకుందాం.
-కమ్మర్పల్లి, ఆగస్టు 18
ఫొటోగ్రఫీ అనే మాట గ్రీకు భాషలోంచి వచ్చింది. ఫొటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడం. ఒక రూపాన్ని రసాయనాలతో చేసిన ప్లేట్పై కాంతి చర్యలతో బంధించడమే ఫొటోగ్రఫీగా ప్రారంభమైంది. కెమెరా అనే మాట లేనప్పుడు ఒక కదిలే వస్తువుకు దృశ్య రూపం ఇచ్చే ఆలోచనలతో సాగిన ప్రయోగాల క్రమంలో 11వ శతాబ్దంలో కెమెరా అబ్సిక్యురా అనే మాట మొదలైనట్లు పేర్కొంటారు.16వ శతాబ్దంలో క్లష్టర్ అనే శాస్త్రవేత్త తారు పూసిన గుడ్డతో ఫొటో కెమెరాప్రయోగం చేశాడు. 1833లో విలియమ్ జార్జి డెడాలమ్ భూతచక్రంతో ప్రయోగం చేశాడు. 1839 వరకు వివిధ రకాల విశేష ప్రయోగాలు కొనసాగాక 1870 లో కాలిఫోర్నియా శాస్త్రవేత్త స్టాన్ఫోర్డ్ ఎగిరే గుర్రాన్ని ఫొటో తీశాడు.1882లో ఫ్రెంచి శాస్త్రవేత్త జాల్ మారే ఎగిరే పక్షులపై ఫొటోప్రయోగం చేశాడు. 1889లో డిక్సన్ అనే శాస్త్రవేత్త ప్రకృతి దృశ్యాలను ఫొటోలు తీయడం ప్రారంభించాడు.1836లో తొలి కెమెరా వినియోగంలోకి వచ్చింది. దీంతో ఫ్రాన్స్లో ఓ వీధిని ఫొటో తీశారు.
ఎందరో శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేసినా ఫొటోగ్రఫీలో సిల్వర్ కోటెడ్ కాపర్ ప్లేట్ పై ఎక్స్పోజర్ అయోడిన్ వెపర్ ప్రయోగించిన లూయిస్ డ్యాగూరే విధానం ప్రముఖంగా ముందుకు వచ్చింది. 1826లో ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్త జోసెఫ్ నైసిపోరా నిప్సి తొలి చాయాచిత్రాన్ని తీసి తన ఇంటి వెనుక పెరట్లో సిల్వర్ అణువులు పూసిన ప్లేట్పై ఎనిమిది గంటలు బంధించాడు. కానీ ఆ చాయా చిత్రం ఎక్కువ రోజులు నిలువ లేదు. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ దేశానికే చెందిన లూయిస్ జె.ఎం. డాగూరే ఫొటోగ్రఫీ విధానానికి ఆమోద ముద్ర వేసింది.1839 లో ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగూరే విధానం పేటెంట్ హక్కులు కొనుగోలు చేసి దేశ ప్రజలకు ఉచితంగా అంజేసింది. ఆ రోజు నుంచి ఏటా ఆగస్టు 19 న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రయోగాలు, ఎందరో కృషి ఫలితంగా ఫొటోగ్రఫీ ఎన్నో రంగాలకు విస్తరించింది. ఫ్యాషన్, నేచురల్, పిక్టోరియల్, వైల్డ్ లైఫ్, అం డర్ వాటర్, ఏరియల్, టేబుల్ టాప్, సోషియల్, వెడ్డిం గ్, ఈవెంట్, ఫైన్ ఆర్ట్, ఆర్టిటెక్చరల్, లైఫ్ైస్టెల్, ట్రావెల్, జర్నలిజం, తదితర శాఖోపశాఖలుగా విస్తరించింది. జర్నలిజంలో ఫొటోగ్రఫీ ఉన్న పాత్ర విడదీయలేనిది.