స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
నిజామాబాద్లో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి పోటీల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నిజామాబాద్లో పోటీల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డిలో విజేతలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బహుమతులను ప్రదానం చేశారు.