కోటగిరి/ఖలీల్వాడి/డిచ్పల్లి/ధర్పల్లి/నిజామాబాద్ క్రైం/ ఖలీల్వాడి (మోపాల్),ఆగస్టు 18 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతిని జిల్లా వ్యాప్తంగా గౌడ కులస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో జయంతోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు.
నగరంలోని వినాయక్నగర్లో ఉన్న పాపన్న విగ్రహ ఆవిష్కరణలో గౌడ యువత పాల్గొని నివాళులర్పించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ నాయకులు విపుల్గౌడ్, శ్రీకాంత్గౌడ్, సన్నీగౌడ్, రంజిత్గౌడ్, సతీశ్గౌడ్, చైతన్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘం భవనంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించారు. గౌడ సంఘం మండల ప్రధానకార్యదర్శి అంబటి గంగాప్రసాద్గౌడ్, గౌడ కులస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోటగిరి టీసీఎస్ అధ్యక్షుడు శంకర్గౌడ్, ఉపాధ్యక్షుడు అరుణ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబాగౌడ్, బాన్ మునీం నాగాగౌడ్, శ్రీధర్గౌడ్, సాయికృష్ణాగౌడ్, కృష్ణాగౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లిలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడకులస్తులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల, మాజీ ఎంపీపీలు డీకొండ హరిత, అనంత్రెడ్డి, సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీలు గంగారెడ్డి, ఉపసర్పంచ్ బాలకిషన్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, ఎస్సై శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్టభోజన్న, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి పాల్గొన్నారు.
ధర్పల్లిలోని గౌడసంఘంలో పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్, డీపీపీఎస్ చైర్మన్ నరేందర్గౌడ్, గౌడ సంఘం సభ్యులు మురళీగౌడ్, పోశాగౌడ్, శ్రీధర్గౌడ్, గంగాధర్గౌడ్, దిగంబర్గౌడ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మోపాల్ మండలంలోని బోర్గాం (పీ)లో గౌడ కులసంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గంగాధర్గౌడ్, దర్శన్గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, లింబాగౌడ్, కిరణ్గౌడ్, మురళీగౌడ్, సంజీవ్, వసంత్, శ్రీనివాస్, వెంకట్, నరహరిగౌడ్ పాల్గొన్నారు.
ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు.
పాపన్నగౌడ్ చిత్రపటానికి డీసీ దశరథ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక నగర్లోని పాపన్న విగ్రహానికి సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కిషన్, సూపరింటెండెంట్ మల్లారెడ్డి సిబ్బంది రాజేందర్, ఆనంద్, ఇంతియాజ్, సాజిద్, గంగాధర్, రవి, విజయానంద్ పాల్గొన్నారు.