రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలోని రామలింగ చౌడీశ్వరిదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజులుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన ముగిసింది. ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం, నవగ్రహ పూజ, గోపూజ, మండపారాదన, వాస్తు పూజ, దేవి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు వినాయకుడు, శివలింగం, నందీశ్వరుడు, శ్రీవీరభద్ర స్వామి విగ్రహాలకు వేద పండితుల చేత పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ కార్యవర్గం, గణేశ్, ఉమాకాంత్, నాగరాజ్, స్థానికులు పాల్గొన్నారు.