నిజామాబాద్ రూరల్, జనవరి 21 : నగర శివారులోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపూర్తో పాటు నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఖానాపూర్లో అంగన్వాడీ చిన్నారులతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులకు వ్యాసరచన, మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోర్వ లలితా గంగాధర్, అంగన్వాడీ సూపర్వైజర్ సీతాకుమారి, టీచర్లు రుక్మిణి, శ్రీలత, సునీత, సురేఖ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి, జనవరి 21 : మండలంలోని సుంకిని, దోమలెడ్గిలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమంపై ఉపాధ్యాయినులు, అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి బాలికా విద్యపై అవగాహన కల్పించారు.
ధర్పల్లి, జనవరి 21 : సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లింగవివక్షను ఎదుర్కోవడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినులతో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆకతాయిల నుంచి రక్షణ పొందే విధానంపై వివరించారు. విద్యార్థినులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారిణి సుమలత, చైల్డ్ కౌన్సిలర్ జ్యోత్స్న, ఉపాధ్యాయురాలు సంతోషిని, లత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.