ఖలీల్వాడి, నవంబర్ 22 : జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఎన్వీ దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అనే ప్రధానాంశంతో పాటు ఉప అంశాలైన ‘పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్య పోషణ, సంక్షేమం, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం కోసం సామాజిక, సాంస్కృతిక పద్ధతులు, స్వీయ విశ్వాసం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారతి విధానం, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణ’ అనే అంశాల్లో ఉపాధ్యాయులకు 3 డివిజన్లలో అవగాహన కల్పించామన్నారు.
గైడ్ టీచర్లు సంబంధిత అంశాల్లో విద్యార్థులతో చేయించిన ప్రాజెక్టులను 29న 9 గంటల నుంచి నిర్వహించే జిల్లాస్థాయి ప్రాజెక్టు పోటీలో పాల్గొనేటట్లు ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. గైడ్ టీచర్లు ఇద్దరు విద్యార్థులతో ప్రాజెక్టు బుక్, లాగ్బుక్, 4 చార్ట్లతో హాజరు కావాలని, జిల్లాస్థాయిలో గెలుపొందిన ప్రాజెక్టులు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కె.గంగాకిషన్ 9848219365ను సంప్రదించాలని సూచించారు. ఈ కాంపిటీషన్లో 6 నుంచి 10వ తరగతి చదువుకున్న అన్ని యాజమాన్య పాఠశాలలు అర్హులని, 10-14 సంవత్సరాల విద్యార్థులు జూనియర్ విభాగంలో, 14-17 సంవత్సరాల విద్యార్థులు సీనియర్ విభాగంలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు.