ఖలీల్వాడి, జనవరి 20 : రెండు నెలల క్రితం ఏర్పాటుచేసిన ‘ఆటో షో’తో అందరి మన్ననలు పొందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే.. మరో సరికొత్త కార్యక్రమంతో ప్రజలముందుకు వచ్చింది. నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న నిజామాబాద్లో నగర ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ‘ప్రాపర్టీ షో’ను శనివారం ప్రారంభించనున్నది. ఇందుకోసం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం ముస్తాబయ్యింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రాపర్టీ షో శని, ఆదివారాలు కొనసాగనున్నది.
ఒకే గొడుగు కిందకు..
నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి సారిగా 20కి పైగా నిర్మాణ రంగ సంస్థలను ఒకే గొడుగు కిందకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే తీసుకువస్తున్నాయి.హైదరాబాద్తోపాటు నిజామాబాద్లోని పలు బిల్డర్లు, వెంచర్లకు సంబంధించిన సంస్థలతోపాటు రుణ సదుపాయం కల్పించేలా బ్యాంకులను ఒక్కచోటుకు తీసుకురానున్నాయి. ఇందుకోసం మొత్తం 20 స్టాల్స్ని సిద్ధం చేశారు. కార్యక్రమానికి కో- స్పాన్సర్స్గా శిల్పా రాఘవ, సాకేత్ వ్యవహరించనున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఏవీ డెవలపర్స్, శ్రీ అశోక బిల్డర్స్, ఈఎన్నార్ ప్రాపర్టీస్, నిర్విఘ్న ఇన్ఫ్రా, రాయల్ వోక్, విర్టుసా, గురు రాఘవేంద్ర, హరింద హరివిల్లు, అవని టౌన్షిప్, భూమి స్పేస్, సీతా షెల్టర్స్, అమృత ప్రాజెక్ట్, అక్షయ ఎంటర్ప్రైజెస్, రాజవతార్, విశ్వధరణి, ఇన్ఫో డెవలపర్స్ తదితర సంస్థలు పాల్గొననున్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రతినిధులు సూచించారు.