కామారెడ్డి, జూన్ 30 : జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించారు. లేబర్ అడ్డా వద్ద పేరుకుపోయిన చెత్తను కార్మికులతో తొలగింపజేశారు.
మున్సిపల్ కమిషనర్ పర్వతాలు అనుమతితో స్థానికులు ‘చెత్త వేసిన వారికి రూ. వెయ్యి జరిమానా విధించబడును’అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. పట్టణంలో కూడళ్ల వద్ద చెత్తడబ్బాలను ఏర్పాటు చేస్తామని,ఎవరూ కూడా రోడ్లపైన చెత్త వేయరాదని కమిషనర్ సూచించారు. జేపీఎన్ రోడ్డు వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.