డిచ్పల్లి/ కోటగిరి, డిసెంబర్ 22 : డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి ఉన్నత పాఠశాలను డీఆర్డీవో చందర్నాయక్ గురువారం తనిఖీ చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరును పరిశీలించారు. పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో గోపీబాబు, హెచ్ఎం జనార్దన్, ఇన్చార్జి సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి వినయ్, విండో చైర్మన్ గజవాడ జైపాల్ ఉన్నారు. పొతంగల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను డిప్యూటీ ఈఈ అంజిరెడ్డి, ఏఈ నాగేశ్వరావు, ఎంపీడీవో మారుతి గురువారం పరిశీలించారు. మండలంలోని జల్లాపల్లిఫారం, జల్లాపల్లి అబాది, హంగర్గాఫారం, కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామాల్లో ని పాఠశాలల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.