మోర్తాడ్, మే 9: ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను నిలదీయాలని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పి ఐదునెలలు గడుస్తున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపు, చెరకు, ఎర్రజొన్నలకు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పి ఐదేండ్లు గడుస్తున్నా పట్టించుకోని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా కమ్మర్పల్లి మండలం అమీర్నగర్, నర్సాపూర్, కోనాపూర్, కోనాసముందర్ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు. మోసపూరిత హామీలతో ఇప్పటికే ఒకసారి మోసపోయారని, మళ్లీ బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ అదే జరుగుతుందని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తప్ప మిగితావి ఏ ఒక్కటీ అమలుచేయలేదన్నారు. ఈ సందర్భంగా కాం గ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్కు ట్యాబ్ ద్వారా చూపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను హా మీల ఆశల పల్లకీలో ఊరేగించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సురుకు పెట్టాలన్నారు.
ఐదేండ్లు ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ఒక్కసారికూడా గ్రామాలకు రాలేదని, పనుల కోసం నిధులు కూడా మంజూరుచేయలేదని వేముల మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఒక్కసారి కూడా మన గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పింఛన్ ఎన్నో రెట్లు పెంచినట్లు గుర్తుచేశారు. ప్రజల కోసం పోరాడే బాజిరెడ్డిని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీ వద్ద ధర్నా చేయడానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.
రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు ఇవ్వమని చెప్పామని, బీఆర్ఎస్ డిమాండ్తో కొంతమందికి మాత్రమే రైతుబంధు ఇచ్చి వాళ్లే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు వచ్చేలా చేసి రైతుబంధును ఆపివేశారని ఆరోపించారు. రూ.15వేలు రైతుబంధు ఇస్తానని ఎకరం ఉన్నవారికి ఇవ్వడానికి నెలరోజుల పట్టిందని, ఇచ్చిన హామీలన్నీ 155రోజులు అవుతున్నా అమలు ఊసేలేదని అన్నారు. అర్వింద్ స్కిల్డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువకులకు శిక్షణను ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చి ఎందుకు మరిచిపోయాడో ప్రశ్నించాలన్నారు.